వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలను రాకుండా చేస్తున్నారని జగన్ ఆరోపణ

By Santaram
|
Google Oneindia TeluguNews

YS Jagan
శ్రీకాకుళం : జనం బలం చూసుకుని జగన్ రెచ్చిపోతున్నారు. ఎప్పుడూ వినయంగా తలను ఒక పక్కకు వాల్చే ఆయన మాటల పదును పెంచారు. ఓదార్పుయాత్ర సందర్బంగా రోజురోజుకూ ఆయన ప్రసంగంలో కరుకుదనం కనిపిస్తోంది. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ఓదార్పుయాత్రలో జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలను ఓదార్పుయాత్రకు రాకుండా అడ్డుకుంటున్నారని జగన్‌ వ్యాఖ్యానించారు.

ఇది ఎంత వరకు న్యాయమని ఆయన ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌ పుట్టిన రోజుకూడా ఏ ఒక్క ఎమ్మెల్యేనూ నియోజకవర్గాల్లోకి వెళ్లకుండా చేశారని జగన్‌ అన్నారు. రాజశేఖర్ రెడ్డికోసం చనిపోయినవారు కాంగ్రెస్‌ కార్యకర్తలు కాదా? అని ఆయన ప్రశ్నించారు. ఎంతో మంది ఎమ్మెలు ఓదార్పుయాత్రకు రావాలని ఉన్నా రాలేక పోతున్నారని జగన్‌ అన్నారు. దీంతో తన గుండె బురువెక్కిందని, తూర్పు గోదావరి జిల్లాలో ఎమ్మెల్యేలకు తానంటే ప్రాణమని, వారిని కూడా రాకుండా అడ్డుకున్నారని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X