హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ ను ఢీకొట్టిన మంత్రి బొత్స సత్యనారాయణ

By Pratap
|
Google Oneindia TeluguNews

Botsa Satyanarayana
హైదరాబాద్: ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ ఢీకొట్టారు. జగన్ వ్యాఖ్యలపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. జగన్ ఓదార్పు యాత్రను చూసి సిగ్గుపడాలో ఆనందపడాలో అర్థం కావడం లేదని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల వద్ద వ్యాఖ్యానించారు. కాంగ్రెసు రాజకీయాలకు తాము సిగ్గపడడం లేదని, పైగా గర్వపడుతున్నామని ఆయన అన్నారు. జగన్ అన్నట్లు తామేమీ నరకయాతన అనుభవించడం లేదని ఆయన స్పష్టం చేశారు.

వైయస్ జగన్ కుటుంబ వారసుడు మాత్రమేనని, తాము వైయస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసులమని ఆయన చెప్పారు. వైయస్ రాజశేఖర రెడ్డికి తామంతా వారసులమేనని ఆయన అన్నారు. జగన్ ఓదార్పు యాత్ర వల్ల కాస్తా ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనని, ఆ ఇబ్బంది త్వరలోనే సమసిపోతుందని ఆయన అన్నారు. కాంగ్రెసుకు గానీ, కాంగ్రెసు ప్రభుత్వానికి గానీ ఏ విధమైన ఢోకా లేదని ఆయన దీమా వ్యక్తం చేశారు. తాము జగన్ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నామని, అయితే అధిష్టానం రోశయ్యను ముఖ్యమంత్రిని చేయాలని నిర్ణయించిందని, జగనే స్వయంగా రోశయ్య పేరును ముఖ్యమంత్రి పదవికి ప్రతిపాదించారని, దాంతో తాము రోశయ్యకు మద్దతు తెలిపామని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X