వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన హైకమాండ్?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు కాంగ్రెసు అధిష్టానం షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం ధ్రువీకరించడం లేదు. ఈ విషయంపై మాట్లాడడానికి కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ వీరప్ప మొయిలీ కూడా నిరాకరించారు. జగన్ వర్గం కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు. లండన్ పర్యటన నుంచి సోమవారం ఉదయం మొయిలీ తిరిగి వచ్చారు. తాను వచ్చిన వెంటనే పార్టీ కోర్ కమిటీకి చెందిన అహ్మద్ పటేల్, ప్రణబ్ ముఖర్జీలతో మొయిలీ చర్చించి జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చినట్లు తెలుస్తోంది.

జగన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీస్తున్నామని మొయిలీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయంపై ఎవరూ మాట్లాడడం లేదు. జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయంపై రాష్ట్ర కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ కు ఏ విధమైన సమాచారం అందలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X