వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వైయస్ జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన హైకమాండ్?
జగన్ చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నామని, రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీస్తున్నామని మొయిలీ మీడియా ప్రతినిధులతో చెప్పారు. అయితే, జగన్ కు షోకాజ్ నోటీసు జారీ చేసిన విషయంపై ఎవరూ మాట్లాడడం లేదు. జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చిన విషయంపై రాష్ట్ర కాంగ్రెసు కార్యాలయం గాంధీభవన్ కు ఏ విధమైన సమాచారం అందలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తీవ్రంగా పరిగణించినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది.
Comments
వీరప్ప మొయిలీ వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర న్యూఢిల్లీ veerappa moily ys jagan congress odarpu yatra new delhi
Story first published: Monday, July 12, 2010, 13:40 [IST]