హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అసెంబ్లీ నుంచి టీడీపీ, వామపక్షాలు వాకౌట్

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ప్రాథమిక, మాధ్యమిక విద్య అంశంపై జరిగిన చర్చలో విపక్షాలు తమ నిరసనను వ్యక్తం చేశాయి. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రాథమిక, మాధ్యమిక విద్య నాశనమైందంటూ తెదేపా, సీపీఎం, సీపీఐ సోమవారం వాకౌట్‌ చేశాయి. ప్రాథమిక, మాధ్యమిక విద్యకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటివరకు తక్కువ నిధులు విడుదల చేశాయని చంద్రబాబు విమర్శించారు. ఈ అంశంపై లోక్‌సత్తా, ప్రరాపా, ఎంఐఎం, భాజపాలు నిరసన వ్యక్తం చేశాయి.

అంతకు ముందు టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు మాట్లాడుతూ విద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిందని విమర్శించారు. లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ సర్వశిక్ష అభియాన్‌పై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అన్నారు. కేంద్రం విడుదల చేసిన నిధుల్లోంచి మూడోవంతు నిధులను మాత్రమే ప్రభుత్వం వినియోగిస్తుందని ఆయన విమర్శించారు. దీనిపై పీఆర్పీ, ఎంఐఎంలు కూడా నిరసన వ్యక్తం చేశాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X