వైయస్ ఆస్తులపై విచారణ జరిపాలి: కాంగ్రెసు ఎమ్మెల్యే శంకర రావు

Shankar Rao
హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డికి 15 ఏళ్ల కిందట ఉన్న ఆస్తులపై, ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులకు ఉన్న ఆస్తులపై విచారణ జరిపించాలని కాంగ్రెసు సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర రావు డిమాండ్ చేశారు. జగన్ ఆదాయం పన్ను నివేదికలను ఓసారి పరిశీలించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రోశయ్యకు వ్యతిరేకంగా జగన్ చేసిన వ్యాఖ్యలపై ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో తీవ్రంగా విరుచుకు పడ్డారు. జగన్‌ ఓదార్పు యాత్రకు కొందరు కాంగ్రెస్‌ నేతలు జన సమీకరణ చేసి పంపుతున్నారని ఆయన శంకర్రావు తెలిపారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యకు తమ మద్దతు ఉంటుందని ఆయన చెప్పారు.

వైఎస్‌ఆర్‌ అధిష్ఠానానికి విధేయుడిగా ఉండబట్టే పార్టీలో కీలకపదవులు పొందగలిగారని, అధిష్టానం వైయస్ ను రెండు సార్లు ముఖ్యమంత్రిని చేసిందని ఆయన అన్నారు. జగన్‌ కూడా దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి లక్షణాలను అలవర్చుకోవాలని ఆయన హితవు పలికారు. కుటుంబ సభ్యులతో కలిసి కడప దైవ దర్శనానికి వెళ్లి తిరిగి వస్తున్న తనపై జగన్‌ వర్గీయులు దాడికి దిగారని ఆయన ఆరోపించారు. పోలీసులు సైతం పట్టించుకోకపోవడం జగన్‌ కుట్రలో భాగమేనని మండిపడ్డారు.పదవులు త్యాగం చేసిన సోనియా, రాహుల్‌ను జగన్‌ ఆదర్శంగా తీసుకోవాని సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+