వైయస్ జగన్ సముద్రంలో నీటి బొట్టు మాత్రమే: సర్వే సత్యనారాయణ

YS Jagan
హైదరాబాద్: తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ సముద్రంలో నీటి బిందువు మాత్రమేనని కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణ వ్యాఖ్యానించారు. జగన్ ఒక పార్లమెంటు సభ్యుడు మాత్రమేనని, తాను కూడా పార్లమెంటు సభ్యుడినేనని ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో అన్నారు. అధిష్టానాన్ని బ్లాక్ మొయిల్ చేసేలా వ్యవహరించకపోతేనే జగన్ కు రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు. పెద్దలను గౌరవించడం మంచిదని ఆయన అన్నారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకుంటేనే జగన్ రాజకీయ భవిష్యత్తు ఉంటుందని ఆయన అన్నారు.

పార్టీ అధిష్టానం ఆదేశాలను పాటిస్తూ మంచి భవిష్యత్తును సాధించుకోవడానికి వీలుందని ఆయన అన్నారు. అధిష్టానం ఆదేశాల మేరకు నడుచుకోవడం వల్లనే వైయస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడయ్యారని ఆయన అన్నారు. అధిష్టానం రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల గొప్ప నాయకుడిగా ఎదిగే అవకాశం రాజశేఖర రెడ్డికి లభించిందని ఆయన అన్నారు. జగన్ వార్తలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వడంపై ఆయన రుసరుసలాడారు. తెల్లారి లేవగానే టీవీ చానెళ్లు జగన్ వార్తలనే ప్రసారం చేస్తున్నాయని, జగన్ కు అనవసరమైన ప్రాధాన్యం ఇస్తున్నాయని, రాష్ట్రంలో మరే విషయాలు లేనట్లు జగన్ గురించి వార్తలు ప్రసారం చేస్తున్నాయని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+