హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బయ్యారం మైన్స్ అక్రమాలపై అసెంబ్లీలో దుమారం

By Pratap
|
Google Oneindia TeluguNews

Assembly
హైదరాబాద్: ఖమ్మం జిల్లా బయ్యారం గనుల అక్రమాలపై మంగళవారం శాసనసభలో మరోసారి దుమారం చెలరేగింది. సోమవారం శాసనసభలో ఇదే అంశంపై శాసనసభ దద్దరిల్లిన విషయం తెలిసిందే. బయ్యారం గనులకు సంబంధించి లక్షా 35 వేల ఎకరాల భూమిని కొన్ని కంపెనీలకు కట్టబెట్టడంపై శాసనసభలో చర్చ జరగాలని ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభలో తీవ్ర దుమారం చెలరేగింది. బాబ్లీ, ఇతర ప్రాజెక్టులపై చర్చకు సహకరించాలని స్పీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఎంతగా చెప్పినా ప్రతిపక్షాల సభ్యులు వినలేదు.

ప్రతిపక్షాలు గొడవ చేస్తున్న సమయంలో రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు ఎదురు దాడికి దిగారు. ఈ అంశంపై పలు మార్లు శాసనసభలో చర్చించామని ఆయన చెప్పారు. బయ్యారం గనుల వ్యవహారంపై నిన్ననే చర్చించామని, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సమాధానం కూడా ఇచ్చారని, దానిపై మళ్లీ చర్చించాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. గనుల లీజు విషయంలో విధాన నిర్ణయాల్లో లోపాలు లేవని ఆయన చెప్పారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X