మంత్రులతో మంతనాలు : కెవిపి రామచందర్ రావు వ్యూహం ఏమిటి?
కాగా, కాంగ్రెసు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల ఇంచార్జీ జగన్ వ్యవహారంపై కెవిపి రామచందర్ రావుతోనూ, జగన్ తల్లి విజయలక్ష్మితోనూ ఫోనులో మాట్లాడినట్లు తెలిసింది. ముఖ్యమంత్రి కె. రోశయ్య చేసిన తీవ్ర వ్యాఖ్యలను ప్రస్తావించి ఘాటును తగ్గించాలని జగన్ ను చెప్పాలని ఆయన సూచించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే తూర్పు గోదావరి జిల్లా ఓదార్పు యాత్రలో తన మాటల్లో వాడిని జగన్ తగ్గించినట్లు చెబుతున్నారు. అయితే, జగన్ మాటల్లో వాడి తగ్గినప్పటికీ ధిక్కార స్వరం మారలేదు. ఎవరున్నా, లేకున్నా తాను ముందుకు సాగుతానని ఆయన చెప్పారు. శాసనసభ్యులు తన ఓదార్పు యాత్రకు రాకపోవడంపై ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించారు.
Comments
కెవిపి రామచందర్ రావు వైయస్ జగన్ కాంగ్రెసు ఓదార్పు యాత్ర హైదరాబాద్ kvp ramachandar rao ys jagan congress odarpu yatra hyderabad
Story first published: Wednesday, July 14, 2010, 9:49 [IST]