రాజమండ్రి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ పై హైకమాండ్ బాణం గురి తప్పిందా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
రాజమండ్రి: తమ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై పార్టీ అధిష్టానం వేసిన బాణం గురి తప్పిందని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తమ పార్టీ ప్రధాన కార్యదర్సి అంబటి రాంబాబును సస్పెండ్ చేయడం ద్వారా జగన్ ను దెబ్బ తీయాలని అధిష్టానం భావించిందని, అయితే ఆ బాణం గురి తప్పిందని ఆయన సోమవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాముడికి గురి పెట్టిన బాణం హనుమంతుడికి తాకిందని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని ఆటంకాలు కల్పించినా జగన్ ఓదార్పు యాత్ర కొనసాగి తీరుతుందని ఆయన చెప్పారు.

అంబటి రాంబాబుపై వేసిన సస్పెన్షన్ వేటును ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంబటి రాంబాబును సస్పెండ్ చేయడం చారిత్రాత్మక తప్పిదమని ఆయన అభిప్రాయపడ్డారు. తమ పార్టీ పార్లమెంటు సభ్యుడు రాహుల్ గాంధీ తమ రాష్ట్రానికి చెందిన యువ శాసనసభ్యులతో సమావేశం కావడంలో తప్పు లేదని, రాహుల్ గాంధీయే తమ నాయకుడని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెసుకు దిశానిర్దేశం చేసేది జగనే అని ఆయన అన్నారు. జగన్ యాత్ర వ్యక్తిగతమైనా కాంగ్రెసుకు లాభం జరుగుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మనుషులు జగన్ యాత్రకు ఆటంకాలు కల్పించడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. జగన్ వ్యతిరేక శక్తులు కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఆషాఢభూతుల మాటలను ప్రజలు నమ్మబోరని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X