వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికాలో ఆంధ్ర సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

USA
విశాఖపట్నం: విశాఖపట్నం నగరానికి చెందిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు అమెరికాలో మృతి చెందాడు. రాజశేఖర్‌ శనివారం సాయంత్రం (భారత కాలమానం ప్రకారం ఆదివారం) తన పెంపుడు కుక్కపిల్లతో ఆడుతూ సమీపంలో ఉన్న ఈత కొలనులో జారి పడిపోయాడు. ఈత రాకపోవడం, ఇంటి యజమాని, కుటుంబ సభ్యులు ఎవరూ ఆ సమయంలో లేకపోవడంతో ఊపిరాడక మృతి చెందాడు. స్నేహితుల ద్వారా ఈ విషాద వార్త తెలుసుకున్న విశాఖలోని కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.

విశాఖపట్నం నగరంలోని మురళీనగర్ ‌కు చెందిన రాజశేఖర్‌ (28) ఫ్లోరిడాలో సాఫ్ట్‌ వేర్‌ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. మరో ముగ్గురు స్నేహితులతో కలిసి అక్కడ ఉంటున్నాడు. ఈ నెలాఖరున ఇంటికి రావాల్సి ఉందని, అంతలోనే ఈ ఘోరం జరిగిందని కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. రాజశేఖర్‌ తండ్రి ఆనందరావు విశాఖలో మెరైన్‌ ఇంజినీర్‌ గా పనిచేస్తున్నారు. మరో నాలుగు రోజుల్లో రాజశేఖర్‌ మృతదేహం నగరానికి వచ్చే అవకాశం ఉంది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X