వైయస్ జగన్ ఓదార్పుకు కౌంటర్ ఓదార్పు: పురంధేశ్వరి

వైయస్ రాజశేఖర రెడ్డి ఆకస్మిక మృతికి తట్టుకోలేక మరణించినవారి కుటుంబాలను పార్టీ వరంగా ఆదుకోవాలని సోనియా ఆదేశించినట్లు పురంధేశ్వరి చెప్పారు. ఓదార్పు కార్యక్రమం పార్టీ పరంగానే జరగాలని సూచించినట్లు తెలిపారు. బాధితులను సమీకరించి సహాయం అందించాలని సోనియా చెప్పినట్లు ఆమె తెలిపారు. ప్రతి జిల్లాలో వైయస్ విగ్రహాలను పార్టీపరంగా నెలకొల్పాలని సూచించినట్లు ఆమె తెలిపారు. వైయస్ కేవలం కుటుంబానికి చెందిన నాయకుడు కారని, కాంగ్రెసుకు సంబంధించిన నాయకుడని చాటి చెప్పడానికి కాంగ్రెసు ఈ కౌంటర్ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications