హై కమాండ్ కు సవాల్: రెచ్చగొడుతున్న జగన్ వర్గం

చివరకు అధిష్ఠానం జోక్యంతో ఇద్దరు మాత్రం పాల్గొనే అవకాశం ఉండటంతో జగన్ వర్గం కొత్త ఎత్తుగడలకు శ్రీకారం చుట్టింది. జగన్కు పూర్తి మద్దతుగా ఉంటారని భావించిన కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రనరసింహారెడ్డి అధిష్ఠానం మాటకు తలొగ్గడంతో జగన్ వర్గం ఆయనపై ద్విముఖ వ్యూహాన్ని ప్రయోగించింది. ఆ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో ఓదార్పు యాత్రలో ఎమ్మెల్యే పాల్గొనాలని ఒత్తిడి తెచ్చారు. మరోవైపు ఇదే నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థిగా పోటీచేసిన స్వతంత్ర అభ్యర్థి మధుసూదనరావు జగన్ ఓదార్పు యాత్రలో పాల్గొంటానని అన్నారు. ఈ అంశం ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డిని పునరాలోచనలో పడేసింది. ఓదార్పుయాత్రలో తాను పాల్గొనే అంశంపై ఈ నెల 24న ప్రకటించనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో అనుసరించిన ఈ వ్యూహాన్ని అంతటా ప్రయోగించేందుకు జగన్ వర్గం సిద్ధపడింది.












Click it and Unblock the Notifications