బలం ఉంటే వైయస్ జగన్ రోశయ్యను దించేసేవారే?

వైయస్ జగన్ మద్దతిచ్చే శాసనసభ్యుల సంఖ్య రెండు పదులు కూడా దాటనే అంచనాకు పార్టీ అధిష్టానం వచ్చింది. అంతేకాకుండా ప్రభుత్వం పడిపోయినా సరే, జగన్ ను కట్టడి చేయడానికే నిర్ణయించుకుంది. మరో నాలుగేళ్ల పదవీకాలం ఉండడంతో శాసనసభ్యులు తిరిగి ఎన్నికలను ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరు. ఇది కూడా జగన్ కు మైనస్ పాయింటుగానే మారింది. దీంతో వచ్చే ఎన్నికల వరకు వైయస్ మరణం వల్ల వెల్లువెత్తిన సానుభూతిని కాపాడుకోవడం జగన్ కు కష్టంగానే ఉంది. దాంతో ఓదార్పు యాత్ర పేరుతో జిల్లాల యాత్రలను సాధ్యమైనంత ఎక్కువ కాలం సాగించాలనే ఉద్దేశంతో జగన్ వర్గం ఉన్నట్లు అర్థమవుతోంది. వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెసు పార్టీలో పరిస్థితి తనకు అనుకూలంగా లేకపోతే ప్రత్యామ్నాయ ఆలోచన చేయవచ్చునని అనుకుంటోంది. పార్టీ పెట్టే విషయం కూడా ఆ సమయంలోనే ముందుకు వస్తుందని అంటున్నారు.












Click it and Unblock the Notifications