Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఎపిపిఎస్సీ నిర్ణయానికి నిరసనగా 5న తెలంగాణ బద్

Telangana
హైదరాబాద్:ఎపిపిఎస్సీ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 5వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నెల 5వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహించాలనే నిర్ణయానికి నిరసనగా ఒయు జెఎసి ఆ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నెల 4వ తేదీన విద్యాసంస్థల్లో తరగతుల బహిష్కరణ నిర్ణయించనున్నట్లు ఒయు జెఎసి తెలిపింది. గ్రూప్-1 ఉద్యోగాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసింది.

తమ డిమాండ్ కు అంగీకరించకుండా పరీక్ష నిర్వహిస్తే తాము అడ్డుకుంటామని తెలిపింది. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నపత్రాలను తెలంగాణ అభ్యర్థులు చించేస్తారని జెఎసి నాయకుడు సుమన్ తెలిపారు. పరీక్ష హాళ్ల వెలుపల తాము ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఆ రోజు ఏమైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు జెఎసి హెచ్చరించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+