హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఎపిపిఎస్సీ నిర్ణయానికి నిరసనగా 5న తెలంగాణ బద్

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్:ఎపిపిఎస్సీ నిర్ణయానికి నిరసనగా ఈ నెల 5వ తేదీన ఉస్మానియా విశ్వవిద్యాలయం ఐక్య కార్యాచరణ కమిటీ (జెఎసి) తెలంగాణ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నెల 5వ తేదీన గ్రూప్-1 పరీక్ష నిర్వహించాలనే నిర్ణయానికి నిరసనగా ఒయు జెఎసి ఆ బంద్ కు పిలుపునిచ్చింది. ఈ నెల 4వ తేదీన విద్యాసంస్థల్లో తరగతుల బహిష్కరణ నిర్ణయించనున్నట్లు ఒయు జెఎసి తెలిపింది. గ్రూప్-1 ఉద్యోగాల్లో తెలంగాణ వాటా తేల్చిన తర్వాతనే పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేసింది.

తమ డిమాండ్ కు అంగీకరించకుండా పరీక్ష నిర్వహిస్తే తాము అడ్డుకుంటామని తెలిపింది. గ్రూప్-1 పరీక్ష ప్రశ్నపత్రాలను తెలంగాణ అభ్యర్థులు చించేస్తారని జెఎసి నాయకుడు సుమన్ తెలిపారు. పరీక్ష హాళ్ల వెలుపల తాము ఆందోళనలు నిర్వహిస్తామని ఆయన అన్నారు. ఆ రోజు ఏమైనా జరిగితే అందుకు ముఖ్యమంత్రి కె. రోశయ్య బాధ్యత వహించాల్సి వస్తుందని ఒయు జెఎసి హెచ్చరించింది.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X