సహనం కోల్పోతున్న కడప ఎంపి వైయస్ జగన్

YS Jagan
హైదరాబాద్‌: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ క్రమంగా సహనం కోల్పోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఎంత గంభీరంగా కనిపించాలని ప్రయత్నించినప్పటికీ లోలోపలి అసహనం బయటపడుతూనే ఉన్నది. ప్రకాశం జిల్లాలో ఆదివారం జరిగిన ఓదార్పు యాత్రలో ఆయన మాట్లాడిన తీరు, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సంచలన ప్రకటన అందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. తాను ఒంటరినని ఎవరన్నారని వైయస్ జగన్ ప్రశ్నించారు. ఎవరున్నా లేకున్నా తన వెంట ప్రజలున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ద్వితీయ శ్రేణి క్యాడర్ ను ఉపయోగించి శాసనసభ్యులపై ఒత్తిడి తేవాలని చేసిన జగన్ వర్గం వ్యూహం ఫలించలేదు. శాసనసభ్యులు ఆయన ఓదార్పు యాత్రకు దూరంగా ఉండడమే కాకుండా ద్వితీయ శ్రేణి నాయకులు కూడా పెద్గగా ఆయన వైపు రావడం లేదు. దీంతో ఆయన తీవ్ర అసహనానికి గురైనట్లు కనిపిస్తున్నారు. అందుకే ఆయన తన అసహనాన్ని అణచుకోవడానికి ప్రయత్నిస్తూ ఆ ప్రకటన చేశారని విశ్లేషిస్తున్నారు.

కాగా, జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనంటూ బాలినేని శ్రీనివాస రెడ్డి ప్రకటన చేశారు. తన మంత్రి పదవి పోయినా ఫరవాలేదని ఆయన అన్నారు. దీన్ని బట్టి ఏదో ఒక తీవ్రమైన కదుపు రావాలనే జగన్ ప్రయత్నం ఫలించడం లేదని తెలుస్తోంది. ఆ తీవ్రమైన కుదుపు కోసమే బాలినేని ఆ ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. పార్టీ అధిష్టానం తనపై చర్య తీసుకుంటే జగన్ వర్గంలో ఊపు వస్తుందని బాలినేని భావించి ఉండవచ్చు. అందుకే అంత తీవ్రమైన ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. అధిష్టానంపై పూర్తి స్థాయి యుద్ధం ప్రకటించకుండా, అధికారం చేజిక్కించునే దిశగా సాగకుండా ఎంత కాలం ఇలా నెట్టుకుంటూ రావడమనే అసహనం కూడా జగన్ వర్గంలో పొడసూపి ఉంటుందని అంటున్నారు. అధిష్టానం చర్య తీసుకుంటే పూర్తి స్థాయిలో తిరుగుబాటు సమాయత్తం కావచ్చుననేది జగన్ వర్గం వ్యూహంగా కనిపిస్తోంది. అందుకే ఆ విధమైన ప్రకటనలు చేస్తున్నారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+