వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలుగుదేశం...కొత్త స్కీమ్ 'పలకరింపు' ఉద్దేశ్యమిదే

By Srikanya
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి తెలుగు దేశం పార్టీ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. ఇందుకోసం నియోజకవర్గాలవారిగా పలకరింపు కార్యక్రమాన్ని టీడీపీ చేపట్టింది. పార్టీ ఆవిర్భవించి 29 ఏళ్లు అయిన సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సైకిల్‌ పర్యటన ద్వారా ఈ పలకరింపు కార్యక్రమం చేపట్టనుంది. ఈ మేరకు ఇవాళ ఆపార్టీ అధినేత చంద్రబాబు పలకరింపు సీడీలు, వాల్‌పోస్టర్లు విడుదల చేశారు.

పలకరింపు యాత్రకు సంబంధించి జిల్లా పార్టీ కార్యాలయాలకు పంపించనున్న పోస్టర్లు, సీడీలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో చంద్రబాబుకు వెంకటసుబ్బన్న అందించారు. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన అభివృద్ధిని వివరించడంతోపాటు ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునే ఉద్దేశంతో ఈ యాత్రను టీడీపీ చేపట్టింది. పలకరింపునకు సంబంధించిన రూట్ మ్యాప్, షెడ్యూలు వివరాలను పార్టీ త్వరలో నిర్ణయింస్తుందని చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా పార్టీ నేతలు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని వెల్లడించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X