వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ముగ్గురు ఏజెన్సీ గిరిజనుల ప్రాణాలు తీసిన మాంసం

By Pratap
|
Google Oneindia TeluguNews

Vishakapatnam
విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో మాంసం ముగ్గురి ప్రాణాలు తీసింది. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల ముగ్గురు గిరిజనులు మృత్యువాత పడినట్లు వైద్యులు తెలిపారు. అతిసారా వ్యాధి ప్రబలిన నేపథ్యంలో ఈ మరణాలు సంభవించినట్లు భావిస్తున్నారు. నిల్వ ఉంచిన మాంసం తినడం వల్ల మరణాలు సంభవించాయి. విశాఖపట్నం జిల్లా పాడేరు మండలం చింతగున్నె గ్రామంలోని ముగ్గురు మరణించారు.

విశాఖపట్నం జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో విపరీతంగా అతిసారా వ్యాధి ప్రబలింది. ఈ నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతంలోకి వైద్యుల బృందాలను పంపారు. అతిసారాను కట్టడి చేసేందుకు ఆ బృందాలు పనిచేస్తున్నాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X