హైదరాబాద్: తెలంగాణ బంద్ కారణంగా గ్రూప్ వన్ పరీక్ష రాయలేకపోయినవారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ తెలిపింది.ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని బీఈడీ సెంటర్, వరంగల్లోని తేజస్వి హైస్కూల్ కేంద్రాల్లో మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ పేర్కొంది.పరీక్ష రాయని వారు ఈ నెల 23 తేదిలోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.ఐతే అభ్యర్థులు చూపించే కారణాలకు కమిషన్ సంతృప్తి పడితేనే పరీక్ష రాయవచ్చని తెలిపింది.