హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్వర్యంలో హోంగార్డులు సచివాలయ ముట్టడికి యత్నించారు. దీనిని పోలీసులు అడ్డుకొన్నారు. ముట్టడి ఉద్రిక్తతగా మారి పోలీసులు హోంగార్డులపై లాఠీచార్జి చేశారు. మహిళా హోంగార్డులపైనా పోలీసులు తమ ప్రతాపం చూపారు. ఈ ఘర్షణలో కిషన్ రెడ్డి తలకు గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు అయన్ను అరెస్టు చేశారు.