వైయస్ జగన్ దిగి వచ్చారా: బాలినేని శ్రీనివాస రెడ్డి షాకిచ్చారా?

Balineni Srinivas Reddy
హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ దిగి వచ్చారా, మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఆయనకు షాకిచ్చారా అనేది చర్చనీయాంశంగా మారింది. బాలినేని సోమవారం చేసిన ప్రకటన ఆ చర్చకు దారి తీసింది. వైయస్సార్ కుటుంబానికి సమీప బంధువు అయిన బాలినేని శ్రీనివాస రెడ్డి అలా షాకిచ్చే అవకాశాలు లేవని అంటున్నారు. వైయస్ జగన్ కాస్తా దిగి వచ్చినట్లే కనిపిస్తున్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాలని తాను కోరుకుంటున్నానని, అయితే ఇప్పుడే కాదని ఆయన ఆయన అన్నారు. 214వరకు రోశయ్యనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని ఆయన చెప్పారు. అయితే, 2014 ఎన్నికలను జగన్ నాయకత్వంలో కాంగ్రెసు ఎదుర్కుంటే బాగుంటుందని ఆయన అన్నారు. దీన్ని బట్టి జగన్ కాస్తా దిగి వచ్చి వ్యూహాన్ని మార్చుకున్నట్లు అనిపిస్తోంది. అయితే, పార్టీ అధిష్టానాన్ని అయోమయంలో పడేయడానికి కూడా ఆయన ఈ ప్రకటన చేసి ఉండవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

మంత్రివర్గ సమావేశంలో వైయస్ జగన్ ఓదార్పు యాత్ర చర్చకు రాలేదని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్ర ఏడాదిన్నర పాటు సాగుతుందని ఆయన చెప్పారు. జగన్ ఓదార్పు యాత్రకు మంచి స్పందన లభిస్తోందని ఆయన చెప్పారు. 2014లో జగన్ సిఎం కావాలని కోరుకుంటున్నట్లు ఆయన చెప్పారు. వైయస్సార్ ను విమర్శించడం ద్వారా తమ కాంగ్రెసు పార్టీ నేత వి. హనుమంతరావు క్రమశిక్షణను ఉల్లంఘిస్తున్నారని ఆయన అన్నారు. విహెచ్ ఎప్పుడు ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదని బాలినేని వ్యాఖ్యానించారు. విహెచ్ పై తాను అధిష్టానానికి తాను ఫిర్యాదు చేస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+