ఖమ్మం వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అక్రమ సంపాదన కోసమే:కెసిఆర్ పై నామా గరం గరం

By Srinivas
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
ఖమ్మం: తెలుగు దేశం పార్టీ పార్లమెంటు సభ్యుడు నామా నాగేశ్వర రావు శుక్రవారం తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె.చంద్రశేఖర రావుపై విలేకరుల సమావేశంలో తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. కెసిఆర్ చేస్తున్న చేష్టల వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు వెనక్కు పోతున్నాయని ఆరోపించారు. తెలంగాణకు ఇక్కడ ఉన్న ఏ పార్టీ వారు వ్యతిరేకం కాదని, మన వాటాలు, మన రాష్ట్రాన్ని కాపాడుకుంటూనే తెలంగాణకోసం పోరాడాలని హితవు పలికారు. కెసిఆర్ ఇన్నేళ్లుగా ఎంపీగా ఉండి తన నియోజక వర్గానికి, తెలంగాణకు చేసింది శూన్యమని తేల్చిచెప్పారు. తెలంగాణ పేరు చెప్పి అక్రమంగా సంపాదన కూడబెట్టడమే లక్ష్యంగా ఆయన చేసుకున్నారని, ఆ వ్యూహంలో భాగంగానే కెసిఆర్ వ్యాపార సిఈఓలతో భేటీ అయ్యారని దుయ్యబట్టారు.

ఒకవైపు పైకి వ్యాపారాల పేరుతో తెలంగాణను ముంచుతున్నారంటూనే మరోవైపు వారితో భేటీ పెట్టడం వెనుక అక్రమ సంపాదనే లక్ష్యంగా ఉందని తెలుస్తోందన్నారు. వారి వ్యాపారాలను కొమ్ముకాసి వారి నుండి లాభాన్ని ఆర్జిస్తున్నారన్నారు. నాలుగు రోజుల క్రితం లగడపాటిని పొగడటం కూడా ఇందులో భాగమేనన్నారు. తెలంగాణను ఏమైనా వారి కుటుంబం గుత్త పట్టిందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సమితిలో అన్ని ముఖ్య పదవులు వారి కుటుంబ సభ్యులవేనని, ఉన్న పదిమందిలో ఆయన, ఆయన కొడుకు, అల్లుడు ముగ్గురు పదవిలో ఉన్నారని దుయ్యబట్టారు.

గురువారం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలుగు దేశం అధినేత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు మాటలను కెసిఅర్ వక్రీకరించారన్నారు. బాబు మాటలను వారి ఆధ్వర్యంలో నడుస్తున్న ఒక ఛానల్ పదే పదే ప్రసారం చేస్తూ తెలంగాణ ప్రజలకు తప్పుడు సంకేతాలు ఇవ్వాలని చూస్తుందని, కాని ఒకవైపు ఆంధ్ర వ్యాపారస్తులను తెగుడుతూ మరోవైపు వారితో చర్చలు జరుపుతున్న కెసిఅర్ ను ప్రజలు నమ్మరనే విషయాన్ని టీఆర్ఎస్ తెలుసుకోవాలని హితవు పలికారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X