కెసిఆర్ కు చెక్: కాంగ్రెసు యాక్షన్ ఫోరం ఫర్ తెలంగాణ

కెసిఆర్ కు దీటుగా తెలంగాణపై కార్యక్రమాలు చేపట్టేందుకు తెలంగాణ కాంగ్రెసు నాయకులు మంగళవారం చర్చలు జరిపారు. కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు జి. వివేక్ నివాసంలో సమావేశమై భవిష్యత్తు కార్యక్రమంపై చర్చించారు. కార్యక్రమాల నిర్వహణకు కాంగ్రెసు యాక్షన్ ఫోరం ఫర్ తెలంగాణను ఏర్పాటు చేశారు. పార్లమెంటు సభ్యులు రాజయ్య, గుత్తా సుఖేందర్ రెడ్డి, నాయకులు మల్లు రవి, జీవన్ రెడ్డి, కమలాకర రావు, కెఆర్ అమోస్ ఆ ఫోరానికి అధికార ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. కాగా, తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకున్నవారి కుటుంబాలను పరామర్శించి, ఆర్థిక సాయం అందించడానికి కూడా ఓ కార్యక్రమాన్ని రూపొందిస్తున్నారు. అమరవీరుల కుటుంబాలను ఆదుకోవడంలో తాము తెరాస కన్నా ముందున్నామని ప్రకటించుకోవడానికి వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. అలాగే, తెరాస కన్నా దూకుడుగా వ్యవహరించేందుకు కూడా వారు సిద్ధపడుతున్నారు.
ఎపిపిఎస్సీ గ్రూప్ వన్ పరీక్ష, తెలంగాణ న్యాయవాదుల వాటా ఆందోళనల విషయంలో తెరాస ముందు వరుసలో ఉంది. తెరాస ఆ ఆందోళనలో అగ్రభాగాన ఉండగా, ఆ తర్వాత కాంగ్రెసు నాయకులు ముందుకు వచ్చారు. దీంతో తెరాసకు కాంగ్రెసు నాయకులు మద్దతు తెలిపినట్లయింది. క్రెడిట్ కూడా ఎక్కువగా తెరాసనే కొట్టేసింది. ఇటువంటి సందర్బాగాల్లో తెరాస కన్నా ముందు ఉండడానికి ఫోరం పనిచేస్తుందని అంటున్నారు.
-
AP SSC & Inter Results 2026: టెన్త్, ఇంటర్ ఫలితాలు అప్పుడే-తేదీలు ఫిక్స్ ! -
today rashiphalalu: నేడు అద్భుత రాజయోగంతో పండుగ చేసుకునే రాశులు ఇవే -
గ్యాస్ సంక్షోభం వేళ కేంద్రం గుడ్ న్యూస్.. వెంటనే ఇలా చేయండి.. -
Jobs: లక్షల్లో జీతం.. గెజిటెడ్ హోదా! డిగ్రీ ఉంటే చాలు.. -
ఇరాన్ కు సపోర్ట్ చేస్తావా..? పాకిస్థాన్ ను కోలుకోలేని దెబ్బ కొట్టిన యూఏఈ.. -
భారత్ కు పాక్ వార్నింగ్: ఇళ్లల్లోకి చొరబడి చంపుతాం.. -
today rashiphalalu: నేడు వీరికి సంపదలు ఇవ్వనున్న సూర్యుడు, లక్కంటే వీరిదే! -
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
షూటింగ్ లో ఉన్న ఇండియాలోనే అత్యంత ఖరీదైన టాప్-5 చిత్రాలు -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
తిరుమల, అలిపిరిల్లో చిరుతలను గుర్తించడానికి టీటీడీ కొత్త టెక్నాలజీ -
అల్లు అర్జున్-అట్లీ మూవీ టైటిల్ లీక్?.. నెట్టింట రచ్చ!












Click it and Unblock the Notifications