తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తిరుమల శ్రీవారి హుండీలో బుల్లెట్: ఉలిక్కిపడ్డ సిబ్బంది

By Pratap
|
Google Oneindia TeluguNews

Tirumala
తిరుపతి: తిరుమల శ్రీవారి హుండీలో బుల్లెట్ కనిపించింది. ఈ సంఘటనతో తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) సిబ్బంది ఉలిక్కిపడింది. శ్రీవారి హుండీలో ఓ భక్తుడు బుల్లెట్ వేసినట్లు భావిస్తున్నారు. బుల్లెట్ కనిపించడంతో ఉలిక్కిపడిన సిబ్బంది ఆ విషయాన్ని అధికారులకు తెలిపారు. అధికారులు ఈ సంఘటనపై విచారణ ప్రారంభించారు. ఉగ్రవాదుల ముప్పును ఎదుర్కుంటున్న తిరుమలలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఆ భద్రతను ఛేదించి బుల్లెట్ శ్రీవారి హుండీలోకి చేరడం కలవరాన్ని కలిగిస్తోంది.

వైకుంఠం, మహాద్వారాల వద్ద భక్తులను తనిఖీ చేస్తారు. ఆ తనిఖీల తర్వాత కూడా బుల్లెట్ శ్రీవారి హుండీ దాకా చేరింది. అయితే, తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శ ఉంది. సుశిక్షితులైనవారు కాకుండా తాత్కాలిక ఉద్యోగులు తనిఖీలు చేస్తున్నారని, దానివల్ల ప్రమాదం సంభవించే సూచనలున్నాయని అంటున్నారు. కాగా, ఆదివారం తిరుమలకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంది. ఈ స్థితిలో క్యూలైన్లో తోపులాట చోటు చేసుకుంది. అది తొక్కిసలాటకు దారి తీసి తాత్కాలిక షెడ్ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు గాయపడ్డారు. మరికొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X