తిరుమల శ్రీవారి హుండీలో బుల్లెట్: ఉలిక్కిపడ్డ సిబ్బంది
వైకుంఠం, మహాద్వారాల వద్ద భక్తులను తనిఖీ చేస్తారు. ఆ తనిఖీల తర్వాత కూడా బుల్లెట్ శ్రీవారి హుండీ దాకా చేరింది. అయితే, తనిఖీలు తూతూ మంత్రంగా సాగుతున్నాయనే విమర్శ ఉంది. సుశిక్షితులైనవారు కాకుండా తాత్కాలిక ఉద్యోగులు తనిఖీలు చేస్తున్నారని, దానివల్ల ప్రమాదం సంభవించే సూచనలున్నాయని అంటున్నారు. కాగా, ఆదివారం తిరుమలకు భక్తుల తాకిడి తీవ్రంగా ఉంది. ఈ స్థితిలో క్యూలైన్లో తోపులాట చోటు చేసుకుంది. అది తొక్కిసలాటకు దారి తీసి తాత్కాలిక షెడ్ కూలిపోయింది. ఈ ఘటనలో 8 మంది భక్తులు గాయపడ్డారు. మరికొంత మంది సొమ్మసిల్లి పడిపోయారు.
Comments
Story first published: Monday, October 4, 2010, 9:38 [IST]