హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

షోకాజ్ ఇస్తే జగన్ కూడా సమాధానం చెప్పాలి: ఆనం వివేకానంద రెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

Anam Vivekananda Reddy
హైదరాబాద్: పార్టీ ఎవ్వరినీ వదులుకోవడానికి ఇష్టపడదని కాంగ్రెసు ఎమ్మెల్యే ఆనం వివేకానంద పరోక్షంగా జగన్ ను ఉద్దేశించి అన్నారు. పార్టీ ఆధిష్టానం అనవసరంగా నోటీసులు జారీ చేయదని, నోటీసులు అందుకున్న వారు తప్పకుండా అధిష్టానానికి సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి నోటీసులు జారీ చేసినా సమాధానం చెప్పుకోవాల్సిన నైతిక బాధ్యత ఆయనపై ఉందని వ్యాఖ్యానించారు.

పార్టీకి అందరూ కంకణబద్దులై ఉండాలని పొట్టి శ్రీరాములు నెల్లురు ఉదయగిరి శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అయితే పార్టీ నాయకత్వం సైతం జగన్ ఓదార్పు యాత్రను వ్యక్తిగతమని పేర్కొంటూనే, ఓదార్పులో పాల్గొన్నవారిపై, అనుకూలంగా మాట్లాడిన వారిపై వేటు వేయడం సమంజసం కాదన్నారు. ఓదార్పును సమర్థిస్తున్న వారిలో సస్పెండయినవారు, నోటీసులు అందిన వారు ఉన్నారని పార్టీ నాయకత్వం వారి విషయంలో మరోసారి ఆలోచించాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X