కర్ణటకలో రాష్ట్రపతి పాలన విధిస్తే దేశవ్యాప్త ఉద్యమం

రాష్ట్ర ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ వెళ్లిన ప్రతిసారి ఉత్తి చేతులతోనే తిరిగి వస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రిగా అయన మాటలు ఎవరూ వినిపించుకునే పరిస్థితులు లేవని, చివరకు ఆయన మంత్రివర్గం, పార్టీ వాళ్లే ఆయన మాటలకు విలువ ఇవ్వడం లేదన్నారు. చివరకు ఆయనకు సోనియాగాంధీ వద్ద కూడా విలువ లేకుండా పోయిందని అందుకనే ఆయన కోటి ఆశలతో ఢిల్లీ వర్యటిస్తున్నప్పటికీ సోనియా ఆయన ఆశలపై నీళ్లు జల్లుతుందన్నారు.
రాష్ట్లంలో మైక్రోఫైనాన్స్ సంస్థన ఆగడాలు మరీ శృతిమించుతున్నాయని, వాటిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మైక్రో ఫైనాన్స్ లను ప్రోత్సహించిన పాపం రాహుల్ గాంధీదే అన్నారు. పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే రైతులు కల్తీ విత్తనాలు వాడి పంట నష్టపోతున్నారని అందుకు ప్రభుత్వం బాధ్యత వహించటంతో పాటు విత్తనాల కంపెనీలపై చర్యలు తీసుకోవాలన్నారు.












Click it and Unblock the Notifications