వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కోట్లు దోచుకొని విమర్శలా: టీడీపీ అధినేత చంద్రబాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: ప్రజలకు సంబంధించిన కొన్ని వేలకోట్లు దోచుకున్న వారిని విమర్శిస్తే వాళ్లు ప్రతి విమర్శలకు దిగటం వారి నీచత్వానికి నిదర్శనమని తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. మంత్రివర్గంలో ఉన్న మంత్రులే అవినీతికి పాల్పడితే ఇక నీతికి విలువ ఎక్కడ ఉంటుందని ఆయన ప్రశ్నించారు.

సూక్ష్మ రుణ సంస్థల ఆగడాలపై ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు లేఖ రాసినట్లు చెప్పారు. గ్రామాల్లోని సామాన్యులను బలితీసుకుంటున్న సూక్ష్మ రుణ సంస్థలను ప్రభుత్వం ప్రోత్సహించటం దారుణమన్నారు. తెలుగు దేశం పార్టీ ప్రభుత్వంలో మహిళలకు ఎంతో చైతన్యపరిచిన డ్వాక్రా సంస్థలను నిర్వీర్యం చేసి రుణ సంస్థలను ప్రోత్సహించడంతో ఈ పరిస్థితి దాపురించిందని ధ్వజమెత్తారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X