Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పులిలా వచ్చిన వాడు ఇప్పుడు పిల్లిలా మారిపోయాడు

muddu krishnamana naidu
హైదరాబాద్: గవర్నర్ నరసింహన్ రాష్ట్రానికి వచ్చినప్పుడు పులిలా వచ్చాడని ఇప్పుడు పిల్లిలా మారిపోయాడని తెలుగు దేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు ధ్వజమెత్తారు. ఆయన వచ్చి రాగానే ప్రభుత్వానికన్నా ఎక్కువగా అన్నట్లు ప్రదర్శన ఇచ్చాడన్నారు. ఆ తరువాత క్రమంగా ఆయన పిల్లిలా మారిపోయాడని ఎద్దేవా చేశారు.

గవర్నర్ లు కాంగ్రెస్ పార్టీకి ఏజెంట్లుగా మారుతున్నారని, మొన్న కర్ణాటక సంక్షోభంలో గవర్నర్ భరద్వాజ్ ప్రవర్తనే ఇందుకు పెద్ద ఉదాహరణ అన్నారు. భరద్వాజ్ కాంగ్రెస్ అనుకూలంగా రాజ్యాంగ విరుద్దంగా ప్రవర్తించాడన్నారు.

కాంగ్రెస్ నాయకులు పదవుల లేక పిచ్చి పట్టినాళ్లలా తిరుగుతున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి మంత్రివర్గ విస్తరణ కోసం ఢిల్లీ చుట్టూ, విస్తరణ ఉంటే తమ మంత్రి పదవులు కాపాడుకోవడానికి, ఎమ్మెల్యేలు అనుకూలంగా మంత్రి పదవి దక్కించుకోవటానికి రోశయ్య చుట్టు తిరుగుతున్నారని దుయ్యబట్టారు. వీరే కాకుండా కాంగ్రెస్ నాయకులంతా తమ తమ పదవుల కోసం పోరాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడాన్ని మరిచిపోయారన్నారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+