పోస్టులు భర్తీ చేయాలంటూ డిఎస్సీ అభ్యర్థులు సచివాలయ ముట్టడి
పోస్టులను భర్తీ చేయకుండా ప్రభుత్వం తాత్సారం చేస్తుందని వారు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే హామీ ఇచ్చి 24 గంటల్లో సమస్యను పరిష్కరించకపోతే తాము సామూహిక హత్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. నోటీఫికేషన్ ప్రకారమే పోస్టులు భర్తీ చేయాలన్నారు. సుప్రీం కోర్టు తీర్పుతో తమను అన్యాయం జరుగుతుందని, అయితే అందుకు కోటా పద్ధతిలో వెళ్లాలన్నారు. కాగా పోలీసులు అభ్యర్థులను పలువురిని అరెస్టు చేశారు.
కాగా మంత్రిమాణిక్య వరప్రసాద్ డిఎస్సీ 2008 ఫైలుపై సంతకం చేశారు. జీవో-28 ప్రకారం 70 శాతం, మెరిట్ ప్రకారం 30 శాతం రిజర్వేషన్ కేటాయించాలని నిర్ణయించారు.
Comments
Story first published: Thursday, October 21, 2010, 12:44 [IST]