కొమురం భీం విగ్రహంపై విద్యాసాగర్, దానం మధ్య మాటల యుద్ధం

విద్యాసాగర్ రావు మాటలకు ఆరోగ్య శాఖమంత్రి దానం నాగేందర్ స్పందించారు. గిరిజన నాయకుడు కొమురం భీం విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచన అయనకు ఇప్పుడు రావటం హాస్యాస్పదం అన్నారు. డిఎన్ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఆయన మంత్రిగా పని చేశారని అప్పుడు గుర్తుకు రాని కొమురం భీం ఇప్పుడు ఆయనకు గుర్తు రావడం వెనుక ఉద్దేశ్యమేమిటన్నారు. ట్యాంకుబండుపైనున్న విగ్రహాలు ఉత్తుత్తివి కాదని, అవి మహానుభావులవని అన్నారు. వారు విగ్రహం కోసం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే దానిని ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.












Click it and Unblock the Notifications