చంద్రబాబు కాన్వాయ్ పై మెదక్ జిల్లాలో రాళ్ల దాడి
చంద్రబాబు కాన్వాయ్ ని అడ్డుకొని వారు కదలనివ్వలేదు. దీంతో వారిపై తెలుగుదేశం కార్యకర్తలు, తెలుగు దేశం విద్యార్థి విభాగం టిఎన్ఎస్ ఎఫ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇరువర్గాల మధ్య కాసేపు ఘర్షణ చోటు చేసుకుంది. చినికి చినికి వానలా తయారయి ఇరువర్గాలు కొట్టుకున్నారు. చంద్రబాబునాయుడిని అడ్డుకున్న తెలంగాణవాదులపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పోలీసులు ఇరువర్గాలపై లాఠీచార్జి చేశారు. పోలీసులు కొంతమందిని అరెస్టు చేశారు. మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కొందరు రౌడీలను హైదరాబాద్ నుండి తీసుకు వచ్చి తమపై దాడి చేయించారని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. పోలీసులు, ప్రభుత్వం చంద్రబాబునాయుడితో చేతులు కలిపిందని వారు ఆరోపిస్తున్నారు.
Story first published: Friday, October 22, 2010, 15:26 [IST]