మూడో రోజుకు చేరిన టిడిపి నేతల నిరసన: గన్నవరం పిఎస్ వద్ద ఉద్రిక్తత

డెల్టా ఆధునీకరణ పనులు చేపట్టడంలో ప్రభుత్వం విఫలమైందని, ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తోందని తెలుగుదేశం శాసనసభ్యుడు దేవినేని ఉమా మహేశ్వర రావు విమర్శించారు. ఆధునీకరణ పనులను తెలుగుదేశం పార్టీ అడ్డుకుందని మంత్రి పార్థసారథి చేసిన విమర్శలను ఆయన ఖండించారు. డ్రైనేజీ సిస్టం దెబ్బ తినడం వల్ల 30 లక్షల ఎకరాలకు నష్టం వాటిల్లుతోందని ఆయన అన్నారు. మంత్రి పార్థసారథి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ఆయన విమర్శించారు. గన్నవరం పోలీసు స్టేషనుకు పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లాల తెలుగుదేశం నాయకులు కూడా తరలి వస్తున్నారు. దీంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications