హైదరాబాద్ లో పట్టపగలే వెంటాడి వెటాడి రౌడీ షీట్ ను చంపారు

కాగా ఫజల్ హత్య కేసును నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేస్తున్నారు. పేరుమోసిన బడా రౌడీషీటర్ ఆయుబ్ ఖాన్ కు ఫజల్ తోడల్లుడు. వీరిద్దరు కలిసి హైదరాబాదులో లాండ్ సెటిల్మెంటులు చేసేవారు. కొన్నాళ్లు వారిద్దరు కలిసి సెటిల్మెంటులు చేశారు. కొద్దికాలం తర్వాత వారిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. దీంతో ఈ హత్యను ఆయుబ్ ఖానే చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. వారిద్దరి మధ్య లాండుసెటిల్మెంటు గొడవలు ఉండటంతో ఆర్థికలావాదేవీల కారణంగా హత్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. అయితే మరో రౌడీషీటర్ ఖైజర్ కూడా ఈ హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications