హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

పార్లమెంటు సమావేశాలకు వైయస్ జగన్ కొన్నాళ్లు డుమ్మా?

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
హైదరాబాద్: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కొన్నాళ్ల పాటు పార్లమెంటు సమావేశాలకు డుమ్మా కొట్టే అవకాశాలున్నాయి. ఈ నెల 7వ తేదీన నెల్లూరు జిల్లాలో తన ఓదార్పు యాత్రను ముగించిన జగన్ నేరుగా చెన్నై వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఓదార్పు యాత్రలో ఆయన అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. మెడ నొప్పితో, ఎడమ భుజం నొప్పితో ఆయన బాధపడ్డారు. కాస్తా విశ్రాంతి తీసుకున్న తర్వాత ఓదార్పు యాత్రను కొనసాగించి ముగించారు. అయితే, చైన్నైలోని అపోలో ఆస్పత్రిలో వైయస్ జగన్ కు వైద్యులు పరీక్షలు చేశారు. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని జగన్ కు వైద్యులు సలహా ఇచ్చారు. విశ్రాంతికి జగన్ ను ఒప్పిస్తామని దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి తోడల్లుడు వైవి సుబ్బారెడ్డి ఆదివారం చెప్పారు.

అపోలో ఆస్పత్రి నుంచి ఆయన సోమవారం బెంగళూర్ లోని తన నివాసానికి బయలుదేరి వెళ్లారు. అక్కడ ఆయన విశ్రాంతి తీసుకునే అవకాశాలున్నాయి. నిజానికి, సోమవారం సాయంత్రం అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత పార్లమెంటును ఉద్దేశించి చేసే ప్రసంగానికి జగన్ హాజరవుతారని భావించారు. కానీ, ఆయన వెళ్లడం లేదు. పార్లమెంటు సమావేశాలు మంగళవారం నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే, జగన్ కొన్నాళ్ల పాటు పార్లమెంటు సమావేశాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని చెబుతున్నారు. విశ్రాంతి తీసుకుని పూర్తిగా కోలుకున్న తర్వాతనే ఆయన ఢిల్లీకి వెళ్తారని అనుకుంటున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X