హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రాజ్ భవన్ ముట్టడికి ఏబివిపి యత్నం, పలువురి అరెస్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

Hyderabad
హైదరాబాద్: ఎస్ఐ పోస్టుల రాత పరీక్షను వెంటనే రద్దు చేయాలంటూ అఖిల భారత విద్యార్థి పరిషత్(ఏబివిపి) హైదరాబాదులోని రాష్ట్ర గవర్నర్ నివాసమైన రాజ్ భవన్ ను, సచివాలయాన్ని ముట్టడించడానికి ప్రయత్నాలు చేసింది. భారీ సంఖ్యలో విద్యార్థులు ఖైరతాబాదు నుండి రెండు సచివాలయానికి, రాజ్ భవన్ కు బయలు దేరారు. ఖైరతాబాదు చౌరస్తాలో ఆందోళన నిర్వహించారు. హోంమంత్రికి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే ఎస్ ఐ పరీక్షలు రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

ముట్టడికి వెళుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకున్నారు. కొందరిని అరెస్టు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఫ్రీజోన్ కు సంబంధించిన 14ఎఫ్ క్లాజ్ ను తొలగించాలని, ఆ సవరణ జరిగే వరకు ఎస్సై పోస్టులకు తలపెట్టిన రాత పరీక్షను వాయిదా వేయాలని ఎబివిపి కార్యకర్తలు డిమాండ్ చేశారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X