వైయస్ బతికి ఉంటే అసహ్యించుకునేవారు: పొంగులేటి సుధాకరరెడ్డి

YS Jagan
హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డిని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కించపరిచేలా, అవమానించే చర్యలు చేపట్టలేదని ఆయనకు కాంగ్రెస్ లో విశేష స్థానం ఉందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో వైయస్ పోటో పెట్టమని ఎలా ప్రశ్నిస్తారని ఆయన అన్నారు. వైయస్ ఫోటో పెట్టమని కొందరు రాద్దాంతం చేయటం అర్థం లేని చర్యగా కొట్టి పారేశారు.

కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి తాను చేపట్టిన ఓదార్పు యాత్రలో కాంగ్రెస్ జాతీయ నాయకులైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫోటోలు పెట్టారా అని ఆయన ప్రశ్నించారు. వారి ఫోటోలు పెట్టని వారు వైయస్ ఫోటో పెట్టలేదని ప్రశ్నించటం విడ్డూరమన్నారు. జగన్ కాస్త బాధ్యతగా వ్యవహరించి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనుల్లో, కార్యక్రమాల్లో ఆందోళన లేకుండా చూడాలని సూచించారు.

వైయస్ అభిమానులమంటూ కొందరు చేస్తున్న కృత్యాలను వైయస్ బతికి ఉంటే అసహ్యించుకునే వారన్నారు. వైయస్ ఎప్పుడు కూడా అధిష్టానానికి వ్యతిరేకంగా మాట్లాడటంగానీ, కార్యక్రమాలు చేయటం గానీ చేయలేదన్నారు. అధిష్టానం ఆదేశాలు పాటించే ఏ పనైనా చేసేవారన్నారు. వైయస్ నిత్యం సోనియాను ఆకాశానికి ఎత్తేవారన్నారు. కాగా కెకెపై కావురి మాటలను కూడా పొంగులేటి తప్పు పట్టారు. కావురి ఒక పార్లమెంటు సభ్యుడు అయి ఉండి అభ్యంతరకర మాటలు మాట్లాడటం సిగ్గుచేటన్నారు. ఆయన మాటలను చాలా అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+