శ్రీకృష్ణ కమిటీ నివేదిక వాయిదాకు కిరణ్ కుమార్ పైరవీ?

మూడు నెలల పాటు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణను వాయిదా వేయించేందుకు ఆయన తీవ్రంగా ప్రయత్నిస్తున్నారట. ఢిల్లీ స్థాయిలో అందుకు ఆయన పైరవీలు సాగిస్తున్నట్లు వినికిడి. రాష్ట్ర పరిస్థితిపై పట్టు సాధించిన తర్వాత నివేదిక వస్తే ఏ పరిస్థితినైనా ఎదుర్కోవడానికి తనకు వీలు కలుగుతుందని ఆయన భావిస్తున్నట్లు వినికిడి. నివేదిక తెలంగాణకు అనుకూలంగా వస్తే సీమాంధ్రలోనే కాకుండా తెలంగాణలో కూడా ఆందోళనలు తలెత్తే అవకాశం ఉంది. నివేదక సిఫార్సుకు వ్యతిరేకంగా సీమాంధ్రలో, దాన్ని అమలు చేయాలనే డిమాండ్ తో తెలంగాణలో ఆందోళనలు తలెత్తవచ్చు. తెలంగాణకు వ్యతిరేకంగా వస్తే తెలంగాణలో తీవ్రమైన ఆందోళనలు ఉంటాయి. ఈ స్థితిలో తనకు తగిన పట్టు లభించే వరకు శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పణలో జాప్యం జరిగితే బాగుండననే ఉద్దేశంతో ముఖ్యమంత్రి ఉన్నట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications