తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వైయస్ జగన్ సిఎం అయితే రాష్ట్రం మిగలదు: డిఎల్ రవీంద్రారెడ్డి

By Srinivas
|
Google Oneindia TeluguNews

DL Ravindra Reddy
తిరుపతి: మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తిరుపతిలో మీడియా సమావేశంలో డిఎల్ రవీంద్రారెడ్డి మాట్లాడారు. జగన్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ఏమీ మిగలదు అన్నారు. రాష్ట్రం ప్రభుత్వం మొత్తం కుంభకోణాలమయంగా మారుతుందన్నారు. నిత్యం జగన్ సోనియా తన కుటుంబానికి అన్యాయం చేసిందంటున్నారని వైయస్ కుటుంబానికి కాంగ్రెసు చేసిన అన్యాయం ఏమిటని ప్రశ్నించారు. జగన్ దృష్టిలో స్వర్ణయుగం అంటే ఎమ్మార్, రహేజా కుంభకోణాల్లాంటివేనన్నారు.

వైయస్ రాజశేఖరరెడ్డి కుటుంబంలోని వారందరికీ కాంగ్రెసు పదవులు కట్టబెట్టడమే పార్టీ చేసిన తప్పు అన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఎన్ని కుంభకోణాలు వచ్చాయో అందరికీ తెలుసునని అన్నారు. మొత్తం అవినీతిమయం చేశారన్నారు. వైయస్ పాలించిన ఐదేళ్లలో రాష్ట్రంలోని వనరులను అన్ని దోచుకున్నారన్నారు. కాంగ్రెసు పార్టీ వైయస్ ను ప్రోత్సహించనట్లుగా ఎవరినీ వెనుకేసుకు రాలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X