హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విలువలపై మాట్లాడుతున్న జగన్ కు పిచ్చి ముదిరింది: రేవంత్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Revanth Reddy
హైదరాబాద్: మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి పిచ్చి ముదిరిందని తెలుగుదేశం పార్టీ నాయకుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. జగన్ సచ్ఛీలత అంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని దుయ్యబట్టారు. తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మరుక్షణమే అధికారం కోసం ప్రాకులాడిన జగన్ వైఖరి ప్రజలందరికీ తెలుసునన్నారు. ముఖ్యమంత్రి కావాలనే ఒకే ఉద్దేశ్యంతో 150 మందితో సంతకాలు పెట్టించుకోవటం విలువేనా అన్నారు. ఇప్పుడు ఆయన విలువల గురించి మాట్లాడటం సిగ్గుచేటుగా ఉందన్నారు.

జగన్ కు తెలుగువారి ఆత్మగౌరవం అంటూ మాట్లాడే హక్కు లేదని మరో నేత తమ్మినేని సీతారాం అన్నారు. ఆత్మగౌరవం అంటూ జగన్ చెప్పడం విడ్డూరమన్నారు. అది ఏనాడో తెలుగుదేశం పార్టీ ఇచ్చిన పిలుపని అది ప్రజలందరికీ తెలుసునన్నారు. అయినా తెలుగువారి ఆత్మగౌరవం జగన్ కు ఇప్పుడు గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. కాగా సోనియాగాంధీని, కాంగ్రెసు పార్టీ అధిష్టానాన్ని వ్యతిరేకించిన ఆ కుర్రాడి సాహసాన్ని మాత్రం స్వాగతిస్తున్నానని తమ్మినేని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X