విలువలకు కట్టుబడ్డాను కాబట్టే ప్రభుత్వాన్ని కూల్చలేదు: వైయస్ జగన్

YS Jagan
కడప: విలువలకు కట్టుబడ్డాను కాబట్టే తాను ప్రభుత్వాన్ని కూల్చలేదని వైయస్ జగన్ అన్నారు. కడప జిల్లా పులివెందులలో అభిమానులను ఉద్దేశించి ఆయన మంగళవారం ప్రసంగించారు. తనను ముఖ్యమంత్రిని చేయాలంటూ 150 మంది శాసనసభ్యులు సంతకాలు చేసినప్పుడే తాను తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేవాడినేనని, అయితే తనకు విలువలు ఉన్నాయి కాబట్టి వైస్రాయ్ లాంటి హోటళ్లలో క్యాంపులు పెట్టలేదని ఆయన చెప్పారు. తన తండ్రి వైయస్సార్ ప్రాణాలను ఫణంగా పెట్టి కాంగ్రెసు పార్టీని గెలిపించారని, వైయస్సార్ వల్లనే కాంగ్రెసు పార్టీ రాష్టంలో, యుపిఎ కేంద్రంలో అధికారంలోకి వచ్చాయని ఆయన అన్నారు. తన కుటుంబాన్ని కూడా చీల్చడానికి కాంగ్రెసు అధిష్టానం కుట్ర చేయడం తనకు బాధ కలిగించిందని, దాంతో తన సహనం నశించిందని ఆయన చెప్పారు. అధ్వాన్న నీచ రాజకీయాలకు పాల్పడి తన కుటుంబాన్ని చీల్చారని ఆయన అన్నారు.

ఒకవైపు తన సచ్ఛీలత, విశ్వసనీయత, తెలుగింటి ఆత్మగౌరవం ఉన్నాయనీ మరో వైపు కుళ్లు కుతంత్ర రాజకీయాలున్నాయని, ఈ స్థితిలో కడప ఉప ఎన్నికలకు ప్రాధాన్యం ఉందని, రాష్ట్రంలోనే కాదు దేశంలోనే అత్యంత ప్రధానమైన ఎన్నికలుగా ఇవి నిలుస్తాయని ఆయన అన్నారు. కడప, పులివెందులకు ఉప ఎన్నికలు రావడానికి గత 15 నెలల పరిణామాలే కారణమని ఆయన అన్నారు. తాను తన మనస్సాక్షి ప్రకారమే నడుచుకుంటున్నానని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో కడప జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జ్యోతి రెడ్డి, పులివెందుల ఇంచార్జీ భాస్కర రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ మనోహర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+