కెటిఆర్, రమేష్ లకు ఊరట: కొనసాగవచ్చునన్న సుప్రీంకోర్టు

వేములవాడ నుంచి ఎన్నికైన రమేష్, సిరిసిల్ల నుంచి విజయం సాధించిన కెటి రామారావు ఎన్నిక చెల్లదంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై తీర్పు వెలువడక ముందే తెలంగాణ కోసం వారిద్దరు రాజీనామా చేశారు. ఆరు నెలల లోపు ఎన్నికలు నిర్వహించాలనే నిబంధన ప్రకారం ఆ రెండు స్థానాలకు కూడా హైకోర్టులో కేసు పెండింగులో ఉండగానే ఎన్నికలు నిర్వహించారు. తిరిగి ఆ స్థానాల నుంచి వారిద్దరే పోటీ చేసి విజయం సాధించారు. కేసు కోర్టులో పెండింగులో ఉండగా ఉప ఎన్నికలు నిర్వహించడంపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది.












Click it and Unblock the Notifications