విధివిధానాలు ప్రకటించాక వైయస్ జగన్ పార్టీపై స్పందిస్తాం: కెటిఆర్
ఉద్యమాలు చేసిన విద్యార్థులపై కేసులు ఎత్తివేత విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరి సరిగా లేదన్నారు. నోటితో మాట్లాడి నొసటితో వెక్కిరించినట్లు వారి వైఖరి ఉందన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దినదినగండంగా తయారయిందన్నారు. ప్రభుత్వ వైఖరి తెలంగాణ పట్ల, తెలంగాణ విద్యార్థులపట్ల సరిగా లేదన్నారు. మాజీ పార్లమెంటు సభ్యుడు, దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఇంకా పెట్టలేదని ఆయన పెట్టిన తర్వాత ఆయన విధివిధానాలు చూసిన తర్వాత స్పందిస్తామని అన్నారు.
Comments
కెటి రామారావు వైయస్ జగన్ చంద్రబాబు నాయుడు తెలంగాణ హైదరాబాద్ kt rama rao ys jagan chandrababu naidu telangana hyderabad
Story first published: Tuesday, December 14, 2010, 12:53 [IST]