హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శాసనసభ నుండి తెరాస ఎమ్మెల్యేల సస్పెన్షన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: ఉద్యమాలలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తున్న తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభ్యులను శాసనసభ ఉప సభాపతి నాదెండ్ల మనోహర్ సభనుండి సస్పెండ్ చేశారు. తెరాస వారిని శాసనసభ ఉదయం సెషన్ వరకు ఆయన వారిని సస్పెండ్ చేశారు. వారిని సస్పెండ్ చేసినప్పటికీ వారు సభను వీడక పోవటంతో నాదెండ్ల వారిని సభనుండి వెళ్లి పోవాలని పదే పదే విజ్ఞప్తి చేశారు. రైతులు పంట నష్టపోయి తీవ్రంగా నష్టపోయి తీవ్ర ఆందోళనలో ఉన్నారని, విద్యార్థుల సమస్యపై హోంమంత్రి తన సమాధానాన్ని చెప్పినందున రైతుల సమస్యపై చర్చించుదామని కోరారు.

తెరాస సభ్యులు ప్రభుత్వానికి, తెలంగాణ కాంగ్రెసు శాసనసభ్యులకు, మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థులపై కేసు ఎత్తివేయాలంటూ తెరాస సభ్యులు పలుమార్లు పోడియం వద్దకు దూసుకు వచ్చారు. ప్రభుత్వం తన వివరణ ఇచ్చుకుందని తెరాస పట్టుబట్టడం సరికాదని, నేనే చేయాల్సిందంతా చేశానని నాదెండ్ల అన్నారు. ప్రభుత్వం విద్యార్థులపై కేసులు ఎత్తివేయకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అంతకుముందు తెరాస ప్రభుత్వంపై ధ్వజమెత్తింది. జైళ్లలో ఉన్న విద్యార్థులను వెంటనే విడుదల చేసి, కేసులన్నీ ఎత్తివేయాలని డిమాండు చేశారు. సస్పెన్షన్ తర్వాత తెరాస శాసనసభ్యులు అసెంబ్లీ ఎంట్రన్సు వద్ద బైఠాయించారు. అనంతరం వారు గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపం వద్దకు ర్యాలీగా చేరుకున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X