అఖిల పక్షంలో చరిత్ర తెలుసుకోవడానికి రాలేదు: సిఎంపై యనమల ఫైర్

తడిసిన ధాన్యాన్ని కొనలేమని ప్రభుత్వం అంటుందన్నారు. ప్రకృతి విపత్తులు ఏర్పడితే తక్షణ సాయం గురించి ముఖ్యమంత్రి ప్రస్తావించటం లేదన్నారు. రాష్ట్రం, కేంద్రం ప్రకటించిన సాయం ఏ మాత్రం సంతృప్తికరంగా లేదన్నారు. ఓ ప్రతిపక్ష నేత నిరాహార దీక్ష చేస్తుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరిగా లేదన్నారు. ముఖ్యమంత్రి అఖిల పక్షం పేరుతో చర్చకు పిలిచి నిర్లక్ష్యంగా వ్యవహరించారన్నారు. మాట్లాడితే కేంద్రానికి లేఖలు రాశామని చెప్పటం సమంజసం కాదన్నారు.
ప్రభుత్వం చెప్పే లెక్కలు వాస్తవ విరుద్దంగా ఉన్నాయని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి రాఘవులు అన్నారు. ముఖ్యమంత్రికి అనుభవం లేకుంటే అనుభవం ఉన్న మంత్రులు ఏం చేస్తున్నారన్నారు. వారు కూడా సమస్యలపై సరిగా స్పందించటం లేదన్నారు. సమస్యలను పక్క దారి పట్టించేందుకు ప్రభుత్వం వ్యవహరిస్తోందని సిపిఐ పార్టీ అధ్యక్షుడు నారాయణ అన్నారు. కేరళ, తమిళనాడు తరహా సాయానికి ఆయన ఒప్పుకోవడం లేదన్నారు. మంత్రి ధర్మాన మాకు అంతర్జాతీయ రాజకీయాలు చెబుతున్నారన్నారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించడానికి పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. పరిహారం విషయంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తీరు బాగా లేదన్నారు.












Click it and Unblock the Notifications