ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెసుకు ఢోకా లేదు: కిరణ్ కుమార్ రెడ్డి

Kiran Kumar Reddy
తిరుపతి‌: ఎవరు వెళ్లిపోయినా కాంగ్రెసు పార్టీకి నష్టం లేదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. తిరుపతిలోని పద్మావతి అతిథి గృహంలో ఆయన శనివారం ఉదయం పార్టీ నేతలతో సమావేశమయ్యారు. కాంగ్రెసు పార్టీ నుంచి చాలా మంది వెళ్లిపోయారని, కాంగ్రెసు పార్టీలో ఇవన్నీ మామూలేనని, కాంగ్రెసు పార్టీకి ఏమీ కాదని ఆయన అన్నారు. పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఆయన నాయకులకు సూచించారు. పార్టీ పటిష్టతే ముఖ్యమని ఆయన చెప్పారు.

రైతులు ఆత్మహత్యలు చేసుకోవద్దని, మనో ధైర్యం కోల్పోవద్దని ఆయన కోరారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. త్వరలో రైతులకు మరో మంచి ప్యాకేజీ ఇస్తామని కూడా ఆయన చెప్పారు. ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మన రాష్ట్రంలో రైతులకు ప్యాకేజీ ఇచ్చామని ఆయన చెప్పారు. పది శాతం తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని ఆయన చెప్పారు. సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తూ రైతులకు సహాయం అందిస్తామని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+