వైయస్ జగన్ పై వైయస్సార్ శిష్యుడు రఘువీరా రెడ్డి ధ్వజం

సూచనలు చేస్తే తాము స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నామని, తమ ప్రభుత్వం బేషిజాలకు వెళ్లదని ఆయన అన్నారు. ఇంకా మూడు, మూడున్నరేళ్లు ఈ ప్రభుత్వం కొసాగుతుందని వైయస్ జగన్ కూడా అంటున్నారని, అందువల్ల ఏయే పార్టీ ఏయే స్థానంలో ఉంటుందని మాట్లాడే సమయం ఇది కాదని, ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విషయం ప్రస్తావనకు వస్తుందని ఆయన అన్నారు. కాంగ్రెసు పార్టీ ఎందుకు మూడో స్థానానికి వెళ్తుంది, ఎందుకు వెళ్లాలని ఆయన అడిగారు. వైయస్సార్ కాంగ్రెసు ప్రతినిధిగా కార్యక్రమాలు చేశారని, తాము వైయస్సార్ వారసులమని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ మొదలుకుని కాంగ్రెసు కార్యకర్తలంతా వైయస్ను అభిమానించేవాళ్లని ఆయన అన్నారు. కాంగ్రెసు మూడో స్థానానికి పడిపోతుందని వైయస్ జగన్ చేసిన ప్రకటన పేదవాడి మనసును నొప్పిస్తుందని, పేదవాడు అభద్రతా భావానికి గురవుతాడని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications