వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

11న ఢిల్లీలో వైయస్ జగన్ దీక్ష: ఎమ్మెల్యేలు, ఎంపీలతో బల ప్రదర్శన

By Pratap
|
Google Oneindia TeluguNews

YS Jagan
విశాఖపట్నం : విజయవాడలో లక్ష్యదీక్షతో బలప్రదర్శనకు దిగిన కడప మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఇక ఢిల్లీలో బలప్రదర్శన చేయనున్నారు. రైతు సమస్యలపై ఈ నెల 11వ తేదీన ఢిల్లీలో ఒక రోజు దీక్షకు దిగుతానని ఆయన చెప్పారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పును కూడా ఈ దీక్షలో వ్యతిరేకిస్తానని ఆయన చెప్పారు. విశాఖపట్నంలోని ఎన్ఎడి కొత్తరోడ్డులో వైయస్సార్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆయన ప్రసంగించారు. దీంతో ఆయన విశాఖపట్నం జిల్లాలో సోమవారం తన ఓదార్పు యాత్రను ప్రారంభించారు. వైయస్సార్ బతికి ఉంటే సాగునీటి ప్రాజెక్టుల స్థితి ఇలా ఉండేది కాదని ఆయన అన్నారు. కృష్ణా ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి వ్యతిరేకంగా వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.

రైతు సమస్యలపై, కృష్ణా ట్రిబ్యునల్ తీర్పుపై ఈ నెల 11వ తేదీన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయడానికి నిరాహార దీక్ష చేస్తానని ఆయన చెప్పారు. ఈ దీక్షలో తనతో కలిసి వచ్చే శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, నాయకులు పాల్గొంటారని ఆయన చెప్పారు. తన దీక్షతో కేంద్ర ప్రభుత్వం దిగి రాక తప్పదని ఆయన అన్నారు. తన దీక్షతోనైనా ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ రైతు సమస్యలపై దిగి వస్తారని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టును, ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును పూర్తి చేయాలని వైయస్సార్ తలపెట్టారని, కానీ సిగ్గులేని కేంద్ర ప్రభుత్వం వాటిని పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఒంటరి చేసి తనను పార్టీ నుంచి పంపించే పరిస్థితి కల్పించారని, ఒంటరిగా బయటకు వచ్చినా ప్రజల ఆదరాభిమానాలతో చిరునవ్వుతో మనగలుగుతున్నానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి, మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ పాల్గొన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X