హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చిదంబరం భేటీకి చంద్రబాబు గైర్హాజర్

By Pratap
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్: తెలంగాణ, సమైక్యాంధ్రలపై శ్రీకృష్ణ కమిటీ నివేదిక సమర్పించినందున ఇక నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమేనని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. అందువల్లే గురువారంనాడు ఢిల్లీలో జరగనున్న అఖిలపక్ష సమావేశానికి తమ పార్టీ నుంచి ప్రతినిధుల్ని పంపించాల్సిన అవసరం లేదన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి చిదంబరానికి చంద్రబాబు బుధవారం ఒక లేఖ రాశారు. దానికి ముందు యనమల రామకృష్ణుడు, దేవేందర్‌గౌడ్‌, నాగం జనార్దన్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ఎర్రబెల్లి దయాకర్‌రావు తదితరులతో సమావేశమయ్యారు.

శ్రీకృష్ణ కమిటీకి చెప్పాల్సింది చెప్పేశామని, కమిటీ నివేదిక కూడా ఇచ్చాక ఇక దానిపై నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రప్రభుత్వమేనంటూ అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో బాబు లేఖ రాశారు. మరోవైపు, శ్రీకృష్ణ కమిటీ నివేదిక వెలువడిన తర్వాత ఏం చేయాలన్న దానిపై గురువారం పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో సమావేశం కావాలని తెలంగాణ ఫోరం నేతలు నిర్ణయించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X