తుది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే: నాగం జనార్ధన్రెడ్డి

కమిటీని సూచించిన మిగిలిన వాటిని తాము పరిగణలోకి తీసుకోవటం లేదన్నారు. కమిటీ సభ్యులు వారి పరిధి దాటి సూచనలు చేశారన్నారు. ఇంత సమయాన్ని, ఇన్ని కోట్లు ఖర్చు చేసి ఇచ్చిన నివేదిక విలువలు లేని రిపోర్టుగా తయారయిందన్నారు. కమిటీ నివేదిక తెలంగాణ ప్రజల మనోభావాలను, తెలంగాణ ప్రజలను అవమానపరిచే విధంగా ఉన్నాయన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఫజల్ అలీ కమిటీ నివేదికకు పూర్తి భిన్నంగా ఉందన్నారు. తెలంగాణ ప్రజల వాదనలు నిజమని శ్రీకృష్ణ కమిటీ చెబుతూనే మళ్లీ ప్రత్యేక బోర్డులు అనటం ఏమిటని ప్రశ్నించారు. ప్రత్యేక బోర్డులు ఏవీ మాకు వద్దని, కేవలం ప్రత్యేక రాష్ట్రమే కావాలన్నారు.
చివరి నిర్ణయం కేంద్ర ప్రభుత్వమే తీసుకోవాలని, అది తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే కావాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా రానున్న పార్లమెంటు సమావేశాల్లో బిల్లు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో మోహరించిన పోలీసు బలగాలను కూడా వెంటనే ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుంటే శాంతియుతంగా ఉద్యమాలు చేపడతామని, తమను పోలీసు బలగాలు ఏమీ చేయలేవన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఇక్కడి అన్ని పార్టీలు ఏకమై పోరాడాల్సిన ఆవశ్యకత ఉందని ఆయన చెప్పారు.
-
ఏపీ మీదుగా బెంగళూరు, చెన్నై ప్రత్యేక రైళ్లు.. ఇకపై: హాల్ట్ స్టేషన్లు -
విజయ్- త్రిష పెళ్లికి త్రిష తల్లి గ్రీన్ సిగ్నల్..? -
West Bengal Survey: బెంగాల్లో అనూహ్య ఫలితాలు?-తేల్చేసిన మ్యాట్రిజ్ సర్వే..! -
LPG కొరతకు చెక్.. భారత్ మార్కెట్ లోకి DME Fuel !! -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
వైసీపీలోకి సీనియర్ నేత రీ ఎంట్రీ, అదే బాటలో..!! -
కుప్పకూలుతున్న పసిడి ధరలు- భారీగా క్రాష్ -
అందుకే.. విజయ్ జన నాయగన్ డిలే అయింది: పవన్ కల్యాణ్ -
మాస్కోలోని పుతిన్ నివాసంలో తలదాచుకున్న ఇరాన్ సుప్రీం లీడర్..?? -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications