హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఐదు ప్రత్యామన్నాయాలు ఇవే

By Srinivas
|
Google Oneindia TeluguNews

Telangana
న్యూఢిల్లీ: తెలంగాణ అంశంపై కేంద్ర ప్రభుత్వం నియమించిన శ్రీకృష్ణ కమిటీ తన నివేదికలో కేంద్రానికి ఐదు ప్రత్యామ్నాయాలుసూచించినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను, అన్ని వర్గాలను, అన్ని రాజకీయ పార్టీలను సంప్రతించిన తర్వాత వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు చెప్పారు. అన్ని ప్రాంతాల వారు అభివృద్ధిని మొదటగా కోరుకుంటున్నారని శ్రీకృష్ణ కమిటీ సభ్యులు అభిప్రాయ పడ్డ విషయం తెలిసిందే. అందరి సూచనల మేరకే వారు ఆరు సూచనలు చేసినట్టు పేర్కొంటున్నారు. ఆరు ప్రత్యామ్నాయాలను శ్రీకృష్ణ కమిటీ సూచించినట్లు వార్తలు వస్తున్నప్పటికీ ఐదు మాత్రమే ప్రధానంగా ముందుకు వస్తున్నాయి.

రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి విద్య, అభివృద్ధి, నీటి పారుదల బోర్డులు తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కమిటీ తన నివేదికలో మొదటి ప్రత్యామ్నాయంగా సూచించింది. అ తర్వాత అవసరమైతే రెండు రాష్ట్రాలుగా రాష్ట్రాన్ని విడదీయాలని చెబుతున్నారు. ఒకటి తెలంగాణ, రెండు సీమాంధ్రను ఏర్పాటు చేసి, హైదరాబాద్‌ను కొన్నాళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని సూచించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడగొట్టడం మూడో ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు. హైదరాబాదు కేంద్ర పాలితప్రాంతంలో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్‌నగర్ జిల్లాను కలపాలి. అలా కాని పక్షంలో అంధ్రను విడగొట్టి రాయలసీమ, తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదో ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఇప్పటి మాదిరే ఉంచాలని సూచించారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X