శ్రీకృష్ణ కమిటీ సూచించిన ఐదు ప్రత్యామన్నాయాలు ఇవే
రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచి విద్య, అభివృద్ధి, నీటి పారుదల బోర్డులు తెలంగాణకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని కమిటీ తన నివేదికలో మొదటి ప్రత్యామ్నాయంగా సూచించింది. అ తర్వాత అవసరమైతే రెండు రాష్ట్రాలుగా రాష్ట్రాన్ని విడదీయాలని చెబుతున్నారు. ఒకటి తెలంగాణ, రెండు సీమాంధ్రను ఏర్పాటు చేసి, హైదరాబాద్ను కొన్నాళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని సూచించారు. హైదరాబాదును కేంద్రపాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసి తెలంగాణను, సీమాంధ్రను రెండు రాష్ట్రాలుగా విడగొట్టడం మూడో ప్రత్యామ్నాయంగా పేర్కొన్నారు. హైదరాబాదు కేంద్ర పాలితప్రాంతంలో రంగారెడ్డి, నల్గొండ, మహబూబ్నగర్ జిల్లాను కలపాలి. అలా కాని పక్షంలో అంధ్రను విడగొట్టి రాయలసీమ, తెలంగాణను కలిపి రాయల తెలంగాణగా ఏర్పాటు చేయాలని సూచించారు. ఐదో ప్రత్యామ్నాయంగా రాష్ట్రాన్ని సమైక్యాంధ్రగా ఇప్పటి మాదిరే ఉంచాలని సూచించారు.
Comments
Story first published: Thursday, January 6, 2011, 11:39 [IST]