తామంతా రాజీనామాలకు కట్టుబడి ఉన్నాం: పొన్నం ప్రభాకర్

2011లో ప్రజలకు తీపి కబురు అందుతుందని కాంగ్రెసు మరో తెలంగాణ పార్లమెంటు సభ్యుడు జి. వివేక్ అన్నారు. 2011లో తెలంగాణ రాష్ట్రం సాకారమవుతుందని ఆయన చెప్పారు. తెలంగాణ కోసం అధిష్టానంపై ఒత్తిడి తెస్తామని ఆయన చెప్పారు. సీమాంధ్ర నాయకులతో శ్రీకృష్ణ కమిటీ సభ్యులు జల్సా చేశారని ఆయన విమర్శించారు. తెలంగాణ కోసం ఏ పోరాటానికైనా సిద్ధమని పార్లమెంటు సభ్యుడు రాజయ్య అన్నారు.
తెలంగాణ డిమాండ్ బలంగా ఉందని చెప్పడానికి ఉప ఎన్నికల ఫలితాలే నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణ కోసం అధిష్టానాన్ని ఒప్పిస్తామని ఆయన చెప్పారు. యుపిఎ నిర్ణయంపైనే రాష్ట్రంలో కాంగ్రెసు పరువు, ప్రతిష్ట ఆధారపడి ఉన్నాయని ఆయన అన్నారు. బలప్రయోగంతో తెలంగాణ ఉద్యమాన్ని అణచలేరని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications